|
|
by Suryaa Desk | Sun, Mar 23, 2025, 12:07 PM
తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు సుప్రీంకోర్టు నోటీసులు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో నోటీసులు. ఈ నెల 25న సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు కేసు విచారణ. గత విచారణ సందర్భంగా ప్రభుత్వం, అసెంబ్లీ సెక్రటరీ, 10 మంది ఎమ్మెల్యేలు, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు. బీఆర్ఎస్ పిటిషన్ పై ఈ నెల 22లోగా స్పందించాలన్న న్యాయస్థానం. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో మరో సారి నోటీసులు జారీ.దీనిపై బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ ను ఆదేశించాలని కోరింది. విచారణ సందర్భంగా ప్రభుత్వం, అసెంబ్లీ కార్యదర్శి, 10 మంది ఎమ్మెల్యేలు, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22లోగా స్పందించాలని ఆదేశిస్తూ విచారణను 25వ తేదీకి వాయిదా వేసింది. అయితే, గడువు ముగిసినా తెలంగాణ స్పీకర్ స్పందించకపోవడంతో సుప్రీంకోర్టు తాజాగా మళ్లీ నోటీసులు జారీ చేసింది.