|
|
by Suryaa Desk | Mon, Nov 10, 2025, 03:45 PM
హైదరాబాద్ కేంద్రంగా మరో భారీ ఉగ్రకుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) భగ్నం చేసింది. ప్రాణాలు కాపాడాల్సిన ఓ వైద్యుడే.. తన ఇంటిని ప్రయోగశాలగా మార్చి, సైనైడ్ కన్నా అత్యంత ప్రమాదకరమైన ‘రైసిన్’ అనే విష రసాయనాన్ని తయారు చేయడం కలకలం రేపుతోంది. ఐసిస్ సానుభూతిపరులుగా భావిస్తున్న ముగ్గురిని గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేయగా, వారిలో హైదరాబాద్ రాజేంద్రనగర్కు చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ (35) కీలకపాత్ర పోషించినట్లు తేలింది. మొహియుద్దీన్తో పాటు ఉత్తర్ప్రదేశ్కు చెందిన ఆజాద్ సులేమాన్ షేక్, మొహమ్మద్ సుహెల్ సలీంఖాన్లను అహ్మదాబాద్ సమీపంలోని అదాలజ్ టోల్ప్లాజా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి తుపాకులు, రసాయన పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. సులేమాన్, సలీంఖాన్లు దిల్లీ, లఖ్నవూ, అహ్మదాబాద్ వంటి సున్నిత ప్రాంతాల్లో విధ్వంసం కోసం రెక్కీ నిర్వహించారని, పాకిస్థాన్ సరిహద్దు నుంచి డ్రోన్ల ద్వారా ఆయుధాలు సేకరించారని ఏటీఎస్ డీఐజీ సునీల్ జోషి వెల్లడించారు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వీరంతా, రైసిన్ ఉపయోగించి దేశంలో పెను విధ్వంసం సృష్టించాలని కుట్ర పన్నినట్లు ఏటీఎస్ పేర్కొంది.