by Suryaa Desk | Mon, Sep 30, 2024, 06:50 PM
తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం కల్తీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని విశ్వహిందూ పరిషత్ నాయకులు సోమవారం నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ కు వినతి పత్రం అందించారు. విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర నాయకులు బాలస్వామి మాట్లాడుతూ.. తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులకు అందించే లడ్డులో జంతువుల కొవ్వు పదార్థాలు ఉన్నాయని వస్తున్న ఆరోపణలపై విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.