by Suryaa Desk | Mon, Sep 30, 2024, 07:23 PM
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి అధికారం తలకెక్కిందని ఘాటుగా విమర్శించారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. మాజీ సీఎం కేసీఆర్కు ఆరేళ్లు పడితే, రేవంత్కు మూడు నెలలు కూడా పట్టలేదన్నారు.మోసానికి మారు పేరు రేవంత్ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్గాంధీని సైతం బురిడీ కొట్టించిన ఘనత రేవంత్రెడ్డి అన్నారు. రేవంత్ మోసపు మాటలను నమ్మి ప్రజలు ఓట్లేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ మొత్తం ఎంత చేసిందో పబ్లిక్ డొమైన్లో పెట్టాలంటూ సీఎం రేవంత్కు సవాల్ విసిరారు ఈటల రాజేందర్.