by Suryaa Desk | Sat, Sep 28, 2024, 06:25 PM
మూసీ నిర్వాసితుల్లో ఎవరికైనా పట్టాలు ఉంటే రెట్టింపు ధరలు చెల్లిస్తున్నామని వెల్లడించారు. మూసీ నిర్వాసితులకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల విలువైన ఇళ్లను ఇస్తున్నామన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ పక్కనే ఈస్ట్, వెస్ట్ కారిడార్ను నిర్మిస్తామన్నారు. 55 కిలోమీటర్ల పొడవైన కారిడార్లు నిర్మిస్తామని వెల్లడించారు. ఈ కారిడార్ల నిర్మాణంతో ట్రాఫిక్ కూడా తగ్గుతుందని వెల్లడించారు.మూసీ ఆధునికీకరణకు ప్రజలు సహకరించాలని కోరారు. వ్యాపారాలు కూడా పెరుగుతాయని వెల్లడించారు. మూసీ వెంట పార్కింగ్ సదుపాయాలు, పార్కులు నిర్మిస్తామన్నారు. పట్టా ఉన్నవాళ్లకు పరిహారం చెల్లించాకే ఖాళీ చేయిస్తున్నట్లు చెప్పారు. మూసీ రివర్ ఫ్రంట్లో ఎలాంటి భవనాలు ఉన్నా తొలగిస్తామని స్పష్టం చేశారు.