by Suryaa Desk | Sat, Sep 28, 2024, 04:12 PM
కోదాడ మండలం గుడిబండ గ్రామానికి చెందిన మహిళ అలివేలు కోదాడ డిపో ఆర్టీసీ బస్సులో ప్రసవించింది. సూర్యాపేట నుండి ఆమె కోదాడ వెళ్ళు తుండగా పురిటి నొప్పులు రావడంతో ఆర్టీసీ సిబ్బంది స్పందించి బస్సును పక్కకు ఆపి తోటి మహిళా ప్రయాణికుల సహాయంతో ఆమెకు పురుడు పోసారు. ఆమె పండంటి ఆడబిడ్డ (మహాలక్ష్మి )కు జన్మనిచ్చింది. వెంటనే సిబ్బంది 108కు కాల్ చేసి ఆమెను సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించినారు. తల్లి బిడ్డ ఆరోగ్యం క్షేమంగా ఉన్నారు.