by Suryaa Desk | Thu, Sep 26, 2024, 04:30 PM
జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ను భగత్ సింగ్ యువసేన సభ్యులు గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిశారు. స్వాతంత్ర సమరయోధులు భగత్ సింగ్ 117వ జయంతి సందర్భంగా భగత్ సింగ్ విగ్రహా ఏర్పాటు కార్యక్రమానికి ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యేకి అందజేశారు. ఈ కార్యక్రమంలో చెట్పల్లి సుధాకర్, ప్రభాత్ సింగ్ ఠాగూర్, భగత్ సింగ్ యువసేన సభ్యులు భాను తేజ రావు, భరత్, భోగ సాకేత్, సాయి తేజ, అరవింద్, అఖిలేష్ పాల్గొన్నారు.