by Suryaa Desk | Thu, Sep 26, 2024, 10:30 AM
దళితులు, బడుగు బలహిన వర్గాలకు అండగా నిలిచిన నాయకుడు బోగె రాజారాం అని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. బుధవారం సాయంత్రం మంథనిలో దళిత ఉద్యమకారుడు బోగే రాజారాం 3వ వర్థంతి సందర్భంగా అంబేద్కర్ భవన్ ఆవరణలో ఏర్పాటు చేసిన సంస్కరణ సభలో రాజారాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దళితుల హక్కుల కోసం పోరాడిన రాజారాం ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. ఈకార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.