by Suryaa Desk | Thu, Sep 26, 2024, 04:08 PM
ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయిమెంట్ బ్యూరో ఆధ్వర్యంలో ఫార్మసీలో డిప్లొమా, డిగ్రీ, మాస్టర్స్ చేసిన వారికి ఈ నెల 30వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డిప్యూటీ చీఫ్ టీ రాము తెలిపారు.అపోలో ఫార్మసీ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ జాబ్ మేళాను ఫార్మసిస్ట్, ఫార్మసీ అసిస్టెంట్ ఉద్యోగాలకు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు అభ్యర్థులు బయోడేటా, విద్యార్హతల సర్టిఫికెట్లతో నేరుగా ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ బ్యూరో వద్ద హాజరు కావాలని అయన ఒక ప్రకటనలో కోరారు.