by Suryaa Desk | Tue, Sep 24, 2024, 09:39 PM
మహబూబాబాద్ జిల్లా, గూడూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో 0- 5 సంవత్సరాలలోపు పిల్లల్లో, లోప పోషణ లో ఉన్న పిల్లలకు ఎలాంటి పోషకాహారం, ఆరోగ్య పరీక్షలు ఏవిధంగా నిర్వహించాలి. వారికి, వారి కుటుంబాలకు పోషకాహార విద్యను ఏఎన్ఎం. అంగన్వాడీ టీచర్ గృహ సందర్శనల ద్వారా కౌన్సిలింగ్ చేస్తూ.. ఆరోగ్య సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, వారిని అనగా సామ్, మామ్ అండర్ వ వెయిట్ పిల్లలను, సాధారణ స్థితిలోకి తీసుకురావడానికి హెల్త్ చఅండ్ ఐ సి డి ఎస్ కోఆర్డినేషన్ తో నిర్వహించాలి. ఈ విధంగా కన్వర్జెన్సీ తో ముందుకు వెళితే ఆరోగ్యకరమైన సమాజాన్ని ఏర్పాటు చేయవచ్చని తెలియజేశారు.
ముఖ్యంగా విహెచ్ ఎస్ ఎన్ డి ప్రతి అంగన్వాడి సెంటర్లో నిర్వహించాలి. ఈ కార్యక్రమాలలో తప్పనిసరిగా ఆశ, ఎఎన్ఎం లు, విలేజ్ సెక్రటరీ, అంగన్వాడి టీచర్ లు పాల్గొనాలి. ప్రతి అంగన్వాడి సెంటర్లో తప్పనిసరిగా నిర్వహించాలి. సామ్ , మామ్, పిల్లల్ని మెడికల్ ఆఫీసర్ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. వారికి వైద్యం, సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు.