by Suryaa Desk | Mon, Sep 23, 2024, 05:18 PM
తరచూ భార్యాభర్తల గొడవలతో విసిగి చెందిన వంగ సుమలత 32 అనే మహిళ ఉరి వేసుకుని చనిపోయిన ఘటన సముద్రాల గ్రామంలో చోటుచేసుకుంది. మృతురాలి అన్న తెలిపిన వివరాల ప్రకారం కోహెడ మండలం సముద్రాల గ్రామంలో వంగ బాలరాజు తో 2009లో వివాహం జరిగింది. గత ఐదు, ఆరు సంవత్సరాలుగా తాగినప్పుడు గొడవ పడే వారు నిన్న సాయంత్రం కూడా గొడవ జరగడంతో మనస్థాపం చెంది ఇంట్లోనే ఉరి వేసుకోవడం జరిగింది. భర్త చుట్టుపక్కల వాళ్ళు చూసి హుటాహుటిన సిద్దిపేట సివిల్ హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ ఈరోజు చనిపోవడం జరిగింది.
మృతురాలికి కొడుకు అక్షయ 12 కూతురు తేజస్విని10 కలరు. మృతురాలి ఆడపడుచులు భర్త వేధించడంతో మనస్థాపం చెంది ఉరి వేసుకుని చనిపోయిందని మా చెల్లి చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని మాకు న్యాయం చేయాగలరని మృతురాలి అన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని ఎస్సై అభిలాష్ తెలిపారు.