by Suryaa Desk | Mon, Sep 23, 2024, 02:48 PM
జిన్నారం మండలం ఊట్ల గ్రామపంచాయతీలో గల మత్స్యశాఖ సంఘంలో 20 సంవత్సరాల నుంచి నడుస్తున్న సమస్యకు రెండు గ్రామాల ప్రజలు పరిష్కారం చేసుకున్నారు.మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ ను చిట్కుల్ ఎన్ ఎమ్ ఆర్ కార్యాలయంలో సంఘం సభ్యులు కలిసి ఆయన చేతుల మీదుగా ఊట్ల మత్స్య శాఖ సంఘం నుంచి ఐదు కుంటలను దాదిగూడo గ్రామనికి సంబంధించి నూతనంగా ఏర్పాటు అయిన మత్స్యశాఖ సంఘం సభ్యులు పత్రాలు అందుకున్నారు.పూర్తి ప్రక్రియకు సహకరించిన నీలం మధు ముదిరాజ్ కి మత్స్యకార సంఘం సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వావిలాల సింగిల్ విండో మాజీ ఛైర్మెన్ గడ్డపోతారం మాణిక్యరావు ముదిరాజ్ , సంగారెడ్డి జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ సుంకర బోయిన మహేష్ ముదిరాజ్, దాదిగూడo ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు దాది రమేష్ ముదిరాజ్, సంఘం నాయకులు బొగురు సత్యనారాయణ, పూజారి శ్రీనివాస్,గంగు బిక్షపతి,దాది శ్రీనివాస్, కొరవి దేవేందర్, బిక్షపతి ,బిక్షపతి, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు