by Suryaa Desk | Mon, Sep 23, 2024, 04:01 PM
మల్యాల మండలం తాటిపల్లి గ్రామ ఆదర్శ రైతు రెడ్డి సంఘం అధ్యక్షుడిగా తుకుంట్ల నరసింహారెడ్డి ఆదివారం ఎన్నికయ్యారు. గతంలో పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంఘ సభ్యులు ఈసారి ఎన్నికలకు మద్దతు ఇవ్వడంతో రెడ్డి సంఘం అధ్యక్ష ఎన్నికలు గ్రామంలో ఉత్కంఠ రేపాయి. అధ్యక్ష బరిలో ముగ్గురు ఉండగా ఇరువురి అభ్యర్థుల కంటే 20 ఓట్ల ఆధిక్యంతో తుకుంట్ల నరసింహారెడ్డి అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యారు.
ఉపాధ్యక్షుడిగా తుకుంట్ల లింగారెడ్డి, క్యాషియర్ గా దొంగ లక్ష్మారెడ్డి, కార్యదర్శిగా సూర జనార్దన్ రెడ్డి, పాలకవర్గ సభ్యులుగా నర్ర తిరుపతిరెడ్డి, అట్ల నగేష్ (రాజు),సూర రాజేందర్ ,సూర సాయి ,రెడ్డి రాజేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరికి కాంగ్రెస్ పార్టీ మల్యాల మండల అధ్యక్షుడు దొంగ ఆనందరెడ్డి అభినందనలు తెలిపారు.