by Suryaa Desk | Mon, Sep 23, 2024, 05:15 PM
చందానగర్ దీప్తిశ్రీ నగర్ పార్కులో ఒమేగా హాస్పిటల్, గచ్చిబౌలి వారి సౌజన్యంతో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యులు నిహాలా షరీన్ , సాయితేజ , అనుష, ప్రసాదరెడ్డి స్మార్ట్ విజన్ వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ మారిన జీవనశైలిలో పర్యావరణంలో వస్తున్న అనేక మార్పుల వల్ల ప్రజలు అనేక వ్యాధులకు గురవుతున్నారన్నారు.
ఈ వైద్య శిబిరంలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు సీతారామయ్య, సుమన్ రెడ్డి, మంగపతి,సురేష్, శేఖర్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు జనార్ధన్, వాణి సాంబశివరావు అమ్మయ్య చౌదరి, మల్లేస్వరి, పూర్ణచందర్ రావు, హాస్పిటల్ ప్రతినిధులు అనురాగ్, వెంకటేష్, కౌండిన్యశ్రీ ,నండూరి వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు.