by Suryaa Desk | Mon, Sep 23, 2024, 03:15 PM
ప్రజ్ఞా వికాస్ - ట్రస్మా ఆధ్వర్యంలో శనివారం రోజు ముచ్చింతల్ లోని చినజీయర్ స్వామి వారి ఆశ్రమంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీల్లో పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ కి చెందిన 9వ తరగతి విద్యార్థిని చంద్రకారి లయవర్ధిని పాల్గొని చిన జీయర్ స్వామి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నట్లు గాయత్రి విద్యా సంస్థల ఛైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మా పాఠశాలలో విద్యార్థులలో దాగి ఉన్న లేఖన, చిత్ర కళలు, ఆటలు తదితర కళలను వెలికి తీసే ప్రయత్నంలో భాగంగా పలు రకాల పోటీలకు విద్యార్థినీ విద్యార్థులను సమాయత్తం చేయడం వల్లనే ఈ విధంగా మా పాఠశాల పిల్లలు పలు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని సత్తా చాటి మా పాఠశాలకు, వారి తల్లిదండ్రులకు గొప్ప పేరును తీసుకొనిరావడం ఆనందంగా ఉందన్నారు. ప్రశంసా పత్రం సాధించిన విద్యార్థినిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రజనీ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ విజయ్, రజియుద్దీన్ పాల్గొన్నారు.