దుర్గం చెరువు ఎఫ్టీఎల్ 160 ఎకరాలుగా పేర్కొనడంపై ప్రియతమ్ రెడ్డి పిటిషన్
Fri, Sep 20, 2024, 07:59 PM
by Suryaa Desk | Fri, Sep 20, 2024, 07:54 PM
హైడ్రా అధికారులతో కమిషనర్ రంగనాథ్ సమావేశమయ్యారు. ఈ భేటీలో హిమాయత్ సాగర్ లోని ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లలోని అక్రమ నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు.హిమాయత్ సాగర్ లోని అక్రమ నిర్మాణాలపై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఇటీవల హిమాయత్ సాగర్ లోని ఎఫ్టీ ఎల్, బఫర్ జోన్లపై ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు సర్వే నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదులు, సర్వే నివేదికలపై అధికారులతో రంగనాథ్ చర్చించారు.