by Suryaa Desk | Mon, Sep 23, 2024, 03:47 PM
మెట్ పల్లి పట్టణంలోని వాసవి దేవాలయంలో ఆదివారం నిర్వహించిన అవొప సమావేశంలో నూతన అధ్యక్ష ఎన్నికల్లో బండారి సదాశివ కుమార్ ని ఏకగ్రీవంగా జగిత్యాల జిల్లా అవొప అధ్యక్షులు రాజేషుని శ్రీనివాస్ నియమించారు.ఈ సందర్భంగా బండారి శివ మాట్లాడుతూ తన పై నమ్మకంతో ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. మెట్ పల్లి పట్టణంలో అవొప ని ముందుకు తెసుకెళ్తానని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా బండారు శివని ఆర్యవైశ్య సంఘ పట్టణ అధ్యక్షులు మైలారపు రాంబాబు, శివ మిత్ర బృందం సల్వా తో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దొంతుల రాజు, శివరాత్రి నందయ్య, పడిగేలా శ్రీనివాస్, కోటగిరి ఆనంద్, ముక్క వెంకటేష్, ఎలగందుల అజయ్, చీలమంతుల శివకుమార్, చిటికేసి మహేష్, రాగల్ల మహేష్, తదితరులు పాల్గొన్నారు.