by Suryaa Desk | Mon, Sep 23, 2024, 04:22 PM
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని దమ్మన్నపేట గ్రామంలో గ్రామ మాజీ సర్పంచ్ మిల్కూరి చంద్రయ్య ఆధ్వర్యంలో జగిత్యాల శాంతి పిల్లలు మరియు జనరల్ హస్పిటల్ డాక్టర్ కళ్లెం దీపక్ రెడ్డి ఉచితంగా 95 మంది పిల్లలకు ఓపి చూసి జ్వరం,దగ్గు,జలుబు సంబందించిన రకరకాల వ్యాధులకు అందరికి ఉచితంగా మందులు పంపిణి చేసారు.
గ్రామంలో ఆర్.ఎం.పి&పి.ఎం.పి గా ప్రథమ చికిత్స సేవలు అందిస్తున్న శాతర్ల రవితో కార్యక్రమంను ప్రారంభిచారు.ఈ కార్యక్రమన్ని ప్రారంభించే అవకాశం ఇచ్చినందుకు మిల్కూరి చంద్రయ్యకి రవి ధన్యవాదములు తెలిపారు.ఉచితంగా క్యాంపు ఏర్పాటు చేసినందుకు డాక్టర్ కి మరియు చంద్రయ్యకి గ్రామస్థులు ధన్యవాదములు తెలిపి శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా సీనియర్ నాయకులు బొలిశెట్టి నరేష్,ఆత్మకూరు మాజీ ఎంపీటీసీ మాదాసు నందరవి మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.