by Suryaa Desk | Mon, Sep 23, 2024, 05:34 PM
ఖైరతాబాద్ అశోక్ హోటల్లో ఆదివారం జరిగిన అఖిల పక్ష కుల సంఘాల రాష్ట్ర సదస్సు నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి మాజీ ఎంపీ వి హనుమంతరావు, ఎమ్మెల్సీలు మధుసూదనా చారి, తీన్మార్ మల్లన్న తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ బీసీ కులాల రాష్ట్ర సదస్సు ముఖ్య ఉద్దేశం బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్లు కల్పించాలని, విద్యా ఉద్యోగ రిజర్వేషన్ లను జనాభా ప్రకారం పెంచాలన్నారు.
కులగణన జరిపి బి.సి డిమాండ్లను పూర్తి చేయాలని బీసీ ఉద్యమాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్తేనే విజయం సాధ్యమన్నారు. మన ఓటు మనకె వేసుకొని రాజాధికారాన్ని సాధించుకునే దిశగా ముందుకు వెళ్లాలని, తెలంగాణ రాష్ట్రనికి చివరి ఓసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని, 2028 లో బీసీ ఏ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ వికాస్ సమితి, రాష్ట్ర అధ్యక్షులు బాశెట్టి నర్సింగ్ రావు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, బీసీ వికాస సమితి, బీసీ జర్నలిస్టు ఫోరం తెల్ల హరికృష్ణ,సత్యనారాయణ, గుజ్జ కృష్ణ, గుజ్జ సత్యం, నీల వెంకటేష్, ఉదయ్, నిఖిల్ పటేల్, రమాదేవి, కరుణశ్రీ, కోటేశ్వరి, బీసీ సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు, మహిళా సంఘ నాయకురాలు, యువతీ, యువకులు తదితరులు పాల్గొన్నారు.