by Suryaa Desk | Mon, Sep 23, 2024, 04:01 PM
పి ఆర్ టి యు టి ఎస్ జిల్లా సర్వసభ్య సమావేశం ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు పింగళి శ్రీపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ తదితరులు హాజరయ్యారు సమావేశానంతరం జిల్లా అధ్యక్ష పదవికి మాజీ అధ్యక్షుడు డివిఎస్ ఫణి కుమార్, ప్రధాన కార్యదర్శి కాళం నారాయణరెడ్డి పోటీ పడగా చివరి వరకు ఎన్నిక అనివార్యం అనుకున్నా చివరకు డివిఎస్ ఫణి కుమార్ ని జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ప్రధాన కార్యదర్శిగా మేకల జానారెడ్డి ,గౌరవ అధ్యక్షులుగా ఓరుగంటి శ్రీనివాసులు ,అసోసియేట్ నెంబర్ గా తరాల పరమేశ ,కిరణ్ కుమార్ ఎన్నికైనట్లు రాష్ట్ర అధ్యక్షులు పింగళి శ్రీపాల్ రెడ్డి ప్రకటించారు ఈ కార్యక్రమంలో పిఎంఎటిఎ -టి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు తరాల జగదీష్ వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంఘ సభ్యులు పాల్గొన్నారు.