by Suryaa Desk | Mon, Sep 23, 2024, 03:54 PM
ఆసియా ఖండం లోనే పేరు ప్రఖ్యాతలు పొందిన కేసముద్రం వ్యవసాయ మార్కేట్ కమిటీ పాలక వర్గం నియామకం పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చెయ్యాలని అంబేద్కర్ నేషనల్ ఫెలోషిప్ అవార్డు గ్రహీత పానుగంటి విష్ణువర్ధన్ ప్రజాప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గా వున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి కేసముద్రం వ్యవసాయ మార్కేట్ నేటి వరకు ఎన్నో పేరు. ప్రఖ్యాతలు. ప్రాధాన్యతను సంతరించుకుని రైతుల వ్యవసాయ ఉత్పత్తుల కు తగిన మద్దతు ధర కేటాయించిన ఘనతను సొంతం చేసుకున్నదని అన్నారు. అదేవిధంగా ఇన్ని సంవత్సరాలువ్యవసాయ మార్కేట్ అభివృద్ధి కోసం కష్టపడిన పాలకవర్గాల కు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామని కానీ ప్రస్తుత ప్రజాపాలనలో రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా నిత్యం రైతులు.
అన్నివర్గాల ప్రజలతో మమేకమైన ప్రజా నాయకుడు అంబటి మహేందర్ రెడ్డి గారికి కేసముద్రం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రజాప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదివరకే ప్రకటించిన జాబితాలో ఉన్న ఘంట సంజీవరెడ్డి గారు అంటే కూడా ప్రజలకు ఎంతో అభిమానం.గౌరవం ఉన్నాయని వారి విలువైన సలహాలు.సూచనలు ప్రజాప్రభుత్వానికి ఎంతో అవసరమని పేర్కొంటూ స్థానిక శాసన సభ్యులు మురళీనాయక్ మరియు ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు వ్యవసాయ మార్కేట్ చైర్మన్ నియామకం పై పునరాలోచన చేసి నియోజకవర్గంలో కష్టపడ్డ ప్రతీ కార్యకర్త ను గుర్తించాలని ప్రజాప్రభుత్వంలో పారదర్శకతను. జవాబుదారీతనాన్ని ప్రజలకు తెలియజేయాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.