by Suryaa Desk | Tue, Sep 24, 2024, 02:32 PM
విశేష్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి డా.గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సభ్యత్వ నమోదు సమావేశానికి ముఖ్యఅతిథిగా బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి హాజరైనారు. ఈ సందర్బంగా బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు బిజెపిని కోరుకుంటున్నారు కావున ప్రతి ఒక్కరు బూత్ స్థాయిలో ప్రతి ఇంటింటికి వెళ్లి బిజెపి సభ్యత్వం నమోదు చేసి రానున్న కాలంలో తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేసేలా అందరూ కృషి చేయాలని కోరారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పవిత్ర కార్యంగా భావించాలని, వేడుకగా మార్చాలని అన్నారు. బిజెపి కార్యకర్తల మనోభావాలు దేశభక్తితో ప్రేరణ పొందాయని, భరతమాత సంక్షేమం కోసం, 140 కోట్ల మంది దేశ ప్రజల సంక్షేమం కోసం నిబద్ధమై ఉన్నామని అన్నారు. కొత్త వారిని సభ్యులుగా చేర్చుకొని వారికి ఉపకారం చేశామనే భావన కలిగించకూడదని, దేశ ప్రయోజనాల కోసం వారు ముందుకు రావడం మనకు గర్వకారణం అన్న భావన కలిగించాలని సూచించారు.ఈ కార్యక్రమం అనంతరం పట్టణంలో ప్రముఖులు డాక్టర్ రాజారాం, బాదం రంజిత్ (రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు), మాదారపు సుజిత్ (చార్టర్ అకౌంటెంట్) తదితరులు బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్,అజ్మీరా శ్రీను , రాష్ట్ర ఓబీ సి మోర్చ అధికార ప్రతినిధి గడ్డం ఆంజనేయులు , జిల్లా ఎస్ టి మోర్చ అధ్యక్షులు బానోత్ వీరన్న, జిల్లా కార్యదర్శి గుడిపూడి రాధ కృష్ణా, పట్టణ కౌన్సిలర్ బోడా గోళ్య, మండల అధ్యక్షులు బొద్దిరెడ్డి ప్రతాప్ రెడ్డి, ఆబోత్ రాజు, గంగిడి మహేందర్ రెడ్డి, నేదురు రాజేందర్, నాయిని అశోక్, దుంకదువ్వ రంజిత్, మండల ప్రధాన కార్యదర్షులు కొంపెళ్లి రాజు, గూడూరు సందీప్, తడుక వినయ్, తాల్లపెల్లి రాము, చెల్పూరి రాజు, మూకిడే ప్రభాకర్, జల్లి మధు , మురహరి విజయ్, మహిళా మోర్చ నాయకురాల్లు సూత్రాపు సరిత, మార్త సంధ్య రాణి, యువ మోర్చ నాయకులు అచ్చ దయాకర్, ఆముదాల రమేష్ , పల్లకొండ శ్రీను,కొనుకటి నవీన్, గుగులోత్ వీరన్న, తిరుపతి మరియు తదితరులు పాల్గొన్నారు.=