by Suryaa Desk | Tue, Sep 24, 2024, 01:42 PM
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'పార్టీని వదిలి వెళ్లినవారు కొంతమంది తిరిగి మళ్లీ వస్తామని చెబుతున్నారు. అందులో మంచివాళ్లను తిరిగి చేర్చుకునే విషయం ఆలోచిస్తాం. అరికెపూడి గాంధీ ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో తెలియడం లేదు. త్వరలో శేరిలింగంపల్లిలో ఉపఎన్నిక జరుగుతుంది' అని అన్నారు.చెరువు నిండితే కప్పలన్నీ వస్తాయని సామెత ఉండేది.. మనం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం.. అధికారంలో లేం.. మీ ఎమ్మెల్యే జంపు కొట్టిండు. కానీ ఇవాళ 150 మందితో సమావేశం అనుకుంటే.. వెయ్యి మందికిపైగా వచ్చారంటే శేరిలింగంపల్లి పోరాట స్ఫూర్తికి వందనం చేస్తున్నాను అని కేటీఆర్ తెలిపారు