by Suryaa Desk | Tue, Sep 24, 2024, 09:49 PM
దుబ్బాక పట్టణంలో ఇటీవల నూతనంగా ఎన్నుకోబడిన పద్మశాలి సమాజం కార్యవర్గాన్ని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సన్మానించి కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. పద్మశాలి సంఘ సభ్యుల అభ్యున్నతి కోసం నూతన కార్యవర్గానికి ఎప్పుడు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు జిందం గాలయ్యని ఉపాధ్యక్షులు గూడూరు ఎల్లప్ప ప్రధాన కార్యదర్శి బింగి రమేష్ ని సహాయ కార్యదర్శిసామలేటి అర్జున్ కోశాధికారి కారంపురి గురుచరణ్ లను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి.వెంకటయ్య, పద్మశాలి సంఘ పెద్ద మనుషులు, కౌన్సిలర్లు, పలువురు సీనియర్ బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.