by Suryaa Desk | Thu, Sep 26, 2024, 11:52 AM
మందమర్రి పట్టణంలో కొండచిలువ సంచారం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. శ్రీకృష్ణ ఫంక్షన్ హాల్ ధమ్సప్ గోదాం వద్ద గురువారం కొండచిలువ హల్ చల్ సృష్టించింది. గమనించిన స్థానికులు స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న సభ్యులు కొండచిలువను చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం సమీప అడవిలో వదిలిపెట్టారు.