by Suryaa Desk | Mon, Sep 30, 2024, 04:03 PM
ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఆదిలాబాద్ లోని రణదివ్యానగర్ ప్రాథమికోన్నత పాఠశాల లో సోమవారం వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడు వందల మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులను జిల్లా కలెక్టర్ పాల్గొని పంపిణి చేశారు. అంతకుముందు స్వయంగా విద్యార్థులు తయారు చేసిన కలెక్టర్ చిత్రపటాన్ని బహుమతిగా అందించి అభినందనలు అందుకున్నారు.