by Suryaa Desk | Mon, Sep 30, 2024, 10:37 AM
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్అండ్ఆర్ కాలనీ వేములఘట్ గ్రామస్తులకు సైబర్ నేరాలు, గంజాయి ఇతర మత్తుపదార్థాలపై గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ఉచితంగా వారు చెప్పే ఆఫర్లకు ఆశపడి మరియు భయపడి డబ్బులు పంపించి మోసపోవద్దని సూచించారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని సూచించారు.