by Suryaa Desk | Mon, Sep 30, 2024, 03:48 PM
తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్కి నవంబర్లో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు విద్యాశాఖ అధికారులు. దరఖాస్తుల ప్రక్రియతో పాటు ప్రిపరేషన్కి మూడు నెలల సమయం ఇవ్వనున్నారు.
జనవరి నెలలో టెట్ పరీక్షలు నిర్వహించిన తరువాత ఫిబ్రవరిలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకు తాజాగా డీఎస్సీ ఫలితాల విడుదల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే అని ప్రకటించారు.