by Suryaa Desk | Mon, Sep 30, 2024, 03:56 PM
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ హాస్పిటల్లో రోగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం లింగంపేట మండల కేంద్రానికి చెందిన సాయిలు చేతికి గాయం కావడంతో ఇన్ఫెక్షన్ సోకి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు.
ఆసుపత్రిలోని బాత్రూంలో రోగి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు.