by Suryaa Desk | Mon, Sep 30, 2024, 10:37 AM
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తుల రాకతో ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మారుమోగాయి. గంగిరేణు చెట్టు ప్రాంగణంలో పట్నాలు, బోనాలు, ముడుపులు కట్టి మొక్కులు చెల్లించారు. ఏర్పాట్లను ఆలయ ఈఓ బాలాజీ, ఏఈఓ శ్రీనివాస్, ఆలయ ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్ తదితరులు పర్యవేక్షించారు.