by Suryaa Desk | Sat, Oct 26, 2024, 04:14 PM
జాతీయ రహదారి డివైడర్ల మధ్యలో పూల మొక్కలు నాటి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని మున్సిపల్ కమిషనర్ మోహన్ తెలిపారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మెట్ పల్లి పట్టణంలోని జాతీయ రహదారి డివైడర్ల మధ్యలో 100 ఫినాస్తిన్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డివైడర్ల మధ్యలో ప్రస్తుతం ఫినాయిల్ మొక్కలను నాటుతున్నామని త్వరలోనే పూల మొక్కలను నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
పట్టణ ప్రజలందరూ ఖాళీ స్థలాలలో మొక్కలను నాటి వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర్ రావు, కౌన్సిలర్లు అంగడి పురుషోత్తం, బంగారు కాళ్ళ కిషోర్, డిఈ నాగేశ్వరరావు, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు, విజయ్, నిజాం, అశోక్, నరేష్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.