by Suryaa Desk | Sat, Oct 26, 2024, 03:18 PM
తంగళ్ళపల్లి మండల పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మండల అధ్యక్షుడు ప్రవీణ్ మాట్లాడుతూ ప్రజలు మార్పు కోరుకున్నారు మీ పార్టీని పక్కకు పెట్టీ ప్రజా పాలనకు మద్దతుగా నిలిచారు..రైతుల చేతులకు సంకెళ్లు వేసినా మీరు రైతుల పక్షాన కొట్లడుతాం అనడం సిగ్గుచేటు రైతు సంఘం నాయకులను, మేధావి వర్గాలను జైల్లో వేసినప్పుడు తెలియదా మీరు చేయని రైతు రుణమాఫి మేం చేసి చూపిస్తే కండ్లుమందుతున్నాయి నిన్నటి రోజు అదిలాబాద్ బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడిన తీరుపై మండిపడ్డరు.
అధికారం కోల్పోయిన మత్తులో విచక్షణ కోల్పోయి కేటీఆర్ మాట్లడుతున్నారు అన్నారు.గత 9 సంవత్సరా మీ పరిపాలన హయంలో రైతుల పక్షాన నిలబడని నువ్వు ఈరోజు వాళ్లపై ప్రేమను వలకబోయడం విడ్డూరంగా అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్, మార్కెట్ కమిటీ వైఎస్ ప్రెసిడెంట్ నరసింగం, డైరెక్టర్లు ఆరేపల్లి బాలు,పొన్నాల పరశురామ్, పార్టీ మండల ఉపాధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్, మండల బిసి సెల్ అధ్యక్షులు కావటి మల్లేశం యాదవ్, మైనార్టీ అధ్యక్షులు ఇక్బాల్, నాయకులు కొత్త రవి,మిరల శ్రీనివాస్, బాలసాని శ్రీనివాస్, రమేష్, గుగ్గిళ్ళ భరత్,అభి గౌడ్, గణాధి కిషన్,ఎడ్ల తిరుపతి తదితరులున్నారు