by Suryaa Desk | Sat, Oct 26, 2024, 03:10 PM
శుక్రవారం ఉదయం జూలపల్లి మండలంలోని వెంకట్రావు పల్లి గ్రామంలో పర్యటించిన గ్రామ కార్యదర్శి నేరేడుగొమ్మ సాగర్ రావు..ఈసందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ దయచేసి ప్రతిఒక్కరు ప్రతిరోజు మీఇంట్లో వెళ్లే తడి పొడి చెత్తను వేరుచేసి విజిల్ వేస్తూ వచ్చే మా మున్సిపల్ సిబ్బందికి అందచేయాలని అలాగే విషజ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని.
మీ ఇంటి చుట్టుపక్కల వర్షపు నీరు, పిచ్చిమొక్కలు ఉండకుండా చూడాలని అన్నారు డ్రై డే ఫ్రై డే సందర్భంగా వార్డులో అవగాహన చేయుటకు మీవద్దకు వచ్చే వార్డు ఆఫీసర్, ఆశ వర్కర్లకు, అంగన్వాడి సిబ్బందికి , గ్రామపంచాయతీ సిబ్బందికి సహకరించలని అన్నారు. ప్రతి ఒక్కరు ఇంటి పన్ను ,నల్ల బిల్లు కట్టి గ్రామపంచాయతీ అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు.ఈకార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడి సిబ్బంది గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.