![]() |
![]() |
by Suryaa Desk | Mon, Mar 17, 2025, 04:38 PM
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్రం నుంచి అంగీకారం కోసం పోరాడుతానని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీని కలిసేందుకు అన్ని పార్టీల నేతలు ముందుకు రావాలని అసెంబ్లీ వేదికగా పిలుపునిచ్చారు. అవసరమైన రాజ్యాంగ సవరణ జరిగేలా అందరం కలిసి పోరాడదామన్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచుతామని కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించామని గుర్తుచేశారు. కులగణన, బీసీ రిజర్వేషన్ల ప్రక్రియను ఏడాదిలోపు పూర్తి చేశామన్నారు.