![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 02:03 PM
హైదరాబాద్ పేట్ బషీరాబాద్ లో కిడ్నాప్ కలకలం రేపింది. అప్పు చెల్లించలేదని యువకుడిని కిడ్నాప్ చేశారు. ఫైనాన్సర్ శ్రీనాథ్ రెడ్డి వద్ద యశ్వంత్ అనే యువకుడు రూ. 5 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అయితే అప్పు చెల్లించడంలో జాప్యం చేశాడని యశ్వంత్ ను కిడ్నాప్ చేసి దాడి చేశారని బాధితుడి తల్లి ఫిర్యాదుతో 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ నెల 14 న హోలీ రోజున శ్రీనాథ్ గ్యాంగ్ ...యశ్వంత్ను కిడ్నాప్ చేసి బజాజ్ షో రూమ్ గ్రౌండ్స్ లో తీవ్రంగా దాడి చేశారని యశ్వంత్ తల్లి.. పైనాన్సర్ శ్రీనాథ్ సహా మరో 15 మందిపై కేసు పెట్టింది. తన కుమారుడు కనిపించడం లేదని బాధితుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కంప్లయింట్ అందుకున్న పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ల ప్రకారం 118(1), 127(2) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫైనాన్సర్ శ్రీనాథ్ రెడ్డి వడ్డీ వ్యాపారం చేస్తూ 10 నుంచి 15 రూపాయిల వరకు వసూలు చేస్తున్నాడని ఆరోపణలున్నాయి. బాధితుడు యశ్వంత్ను కిడ్నాప్ చేసిన గ్యాంగ్ బీర్ బాటిల్స్, హాకీ స్టిక్స్, కర్రలు, బెల్ట్ తో దాడి చేశారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.