|
|
by Suryaa Desk | Wed, Mar 11, 2026, 12:48 PM
స్థానిక మదినగూడ ప్రాంతంలో వెలసిన *శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షిక కళ్యాణ మహోత్సవం* అత్యంత వైభవంగా జరిగింది. లోక కల్యాణం కోసం నిర్వహించిన అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను.ఆ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను.మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడంలో ఇలాంటి ఉత్సవాలు ఎంతో దోహదపడతాయి. భక్తి భావం సమాజంలో ఐక్యతను పెంచుతుంది.అనంతరం ఆలయ కమిటీ సభ్యులు *గౌతమ్ గౌడ్* గారిని శాలువాతో ఘనంగా సత్కరించి, అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, ఆలయ కమిటీ ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.