|
|
by Suryaa Desk | Sun, Mar 15, 2026, 12:59 PM
పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలను సందర్శించిన BRS నాయకులు ఐలాపూర్ మాణిక్ యాదవ్ గారు, అక్కడి ప్రజలను కలుసుకుని వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.కాలనీలలో ఉన్న రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు వంటి పలు సమస్యలను స్థానిక ప్రజలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఓపికగా విన్న ఐలపూర్ మాణిక్ యాదవ్ గారు, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను తెలుసుకోవడం తన బాధ్యత అని, అమీన్పూర్ డివిజన్ అభివృద్ధి కోసం ఎప్పుడూ ప్రజలతో కలిసి ముందుకు సాగుతానని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.*