by Suryaa Desk | Fri, Oct 18, 2024, 10:49 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కష్టసుఖాలలో అండగా ఉండి కంటికి రెప్పలా కాపాడుకుంటుందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు.గురువారం దౌల్తాబాద్ మండలం తిరుమలాపూర్ గ్రామంలో మృతి చెందిన కార్యకర్త కుటుంబాలను పరామర్శించి పార్టీ సభ్యత్వ బీమాను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొద్ది నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యాకటి కిష్టయ్య కుటుంబానికి పార్టీ సభ్యత బీమా రెండు లక్షల రూపాయల చెక్కు అందజేయడం జరిగిందన్నారు.
వారి కుటుంబానికి అండగా ఉంటామని తన కొడుకు చదువుల కోసం సహాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. అనంతరం ఐదు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన మాజీ ఏఎంసి డైరెక్టర్ నీరుడు సత్యనారాయణ కుటుంబాన్ని పరామర్శించి వారికి అండగా ఉంటామన్నారు.తిరుమలాపూర్ గ్రామంలో ఇద్దరు ముఖ్య కార్యకర్తలను కోల్పోవడం బాధాకరమన్నారు.వారి కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటాదని మనోధైర్యాన్ని ఇచ్చారు.ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సయ్యద్ రహీముద్దీన్, దుబ్బాక నియోజకవర్గం బీసీ సమన్వయకర్త రణం శ్రీనివాస్ గౌడ్,మాజా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు బండారు దేవేందర్,మాజీ సర్పంచ్ యాదవ రెడ్డి, మండల ప్రధాన గడ్డం నాగరాజు, గ్రామ అధ్యక్షులు రమేష్ గౌడ్, నాయకులు వెంకటయ్య,సత్తయ్య, నర్సింలు,నీరుడి రాజనర్సు,పడాల లచ్చయ్య, నాగరాజ్,బాల్ రెడ్డి,రవీందర్ రెడ్డి, రాజేందర్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.