by Suryaa Desk | Sat, Oct 19, 2024, 01:40 PM
బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కాసాని నర్సింలు ముదిరాజ్, ప్రధాన కార్యదర్శిగా శంకరోళ్ల సురేష్ ముదిరాజ్ లను జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య నీయమించి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా కాసాని నర్సింలు ముదిరాజ్ మాట్లాడుతూ. బీసీ లకు 52 శాతం రిజర్వేషన్ కల్పించి, చట్ట సభల్లో తగిన ప్రాధాన్యత ఇచ్చేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే కృషి చేయాలన్నారు.
బీసీలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రధాన కార్యదర్శి సురేష్ ముదిరాజ్ మాట్లాడుతూ మా ఫై నమ్మకం ఉంచి మాకు ఈ బాధ్యతలు అప్పగించిన జాతీయ అధ్యక్షులు, రాజ్య సభ సభ్యులు ఆర్. కృష్ణయ్య కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బీసీ ల అభివృద్ధికి మా వంతు కృషి చేసి, బీసీలకు అన్ని రంగాల్లో తగిన ప్రాధాన్యత కలిగేలా కృషి చేస్తామన్నారు.