by Suryaa Desk | Sat, Oct 19, 2024, 01:39 PM
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, పిఆర్టీయూ ఉపాధ్యాయ శాసనమండలి అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డికి మద్దతుగా జగదేవపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో ఓటరు నమోదు కార్యక్రమం గురించి ఫామ్ 19 జగదేవపూర్ మండలంలోని ఉన్నత పాఠశాలలకు ఓటు హక్కు ఉన్న ప్రతి ఉపాధ్యాయునికి అందజేయడం జరిగింది. ఉపాధ్యాయుల సమస్యల సాధనలో నిరంతరము పోరాడుతూ ఎన్నో జీవో లను తీసుకొచ్చి ఉపాధ్యాయుల సంక్షేమం గురించి పాటుపడే అతిపెద్ద ఏకైక సంఘం.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వెంకట్రాంరెడ్డి మరియు ప్రధాన కార్యదర్శి బొద్దు నాయక్, సీనియర్ నాయకులు రామకృష్ణారెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్, నరసింహారెడ్డి, రఘురాములు, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు నాగరాజు, మండల అసోసియేట్ అధ్యక్షులు నగేష్, మండల ఉపాధ్యక్షులు భగవాన్ రెడ్డి, మహిళా ఉపాధ్యక్షులు అనురాధ, కార్యదర్శి రంజిత్ కుమార్, ఉపాధ్యాయ సోదరి సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.