by Suryaa Desk | Sat, Oct 19, 2024, 01:46 PM
భారత విద్యార్థి ఫెడరేషన్ దేవరకొండ డివిజన్ అధ్యక్షుడు ,కార్యదర్శులు రామావత్ లక్ష్మణ్ నాయక్,బుడిగ వెంకటేష్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ముఖ్య కార్యకర్తలు సమావేశం నిర్వహించారు ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలవిద్యాసంస్థలు అద్దె భవనాల్లో నడుస్తున్న వాటి యాజమానులు ఈరోజు వరకు కూడా తాళ్లం తీయడం లేదు. గత 12 నెలలు నుండి తమకు అద్దె చెల్లించడం లేదని అద్దె చెల్లించకపోవడంతో తాము చేసేది ఎమిలేక మూసివేస్తున్నామని ప్రకటిస్తున్నారు.
విద్యాసంస్థకు వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్స్ అంతా బయటే ఉన్నారని అధికారులు మాట్లడుతున్న తాళ్లలు తీయడం లేదని ,తక్షణమే ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ కోరుతుంది. తుంగతుర్తి, బెల్లంపల్లి, తాండూరు, వరంగల్, భూపాలపల్లి, హుజూర్నగర్,తొర్రూర్, భువనగిరిలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లకు భవన యజమానులు తాళాలు వేశారు.గురుకులాల సమస్యలు పరిష్కారం చేయాలని ఎస్ఎఫ్ఐ కోరుతుంది.ఈ కార్యక్రమం లో ఎస్.ఎఫ్.ఐ డివిజన్ నాయకులు నేర్లపల్లి జై చరణ్ ,జల్లెల ఇద్ధిరాములు, పోట్ల రాకేష్,మంజుల, నేనావత్ సరస్వతి, రాధిక తదితరులు పాల్గొన్నారు.