by Suryaa Desk | Sat, Oct 19, 2024, 01:35 PM
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్ 2 ప్రెసిడెంట్ కృష్ణారావు కుమారుడి పిల్లలు జయశ్రీ గోపాల్ క్రిష్, కృష్ణ శ్రీ , సౌమ్య మహబూబ్ నగర్ ఆసుపత్రి లో వైద్యవిద్యను అభ్యసించడానికి అర్హత సాధించారు..ఈ సందర్భంగా వారిని పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సత్కరించి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా పీఏసీ చైర్మన్, గాంధీ మాట్లాడుతూ ఒకే కుటుంబంలో ముగ్గురు ఎంబిబిఎస్లో ప్రవేశ పొందడం చాలా అభినదించదగ్గ విషయమన్నారు.
పట్టుదలతో కష్టపడి చదివి తల్లిదండ్రుల కలలను సాకారం చేశారని అభినందనలు తెలిపారు . తల్లిదండ్రులు వారి పిల్లల అభిరుచులకు తగ్గట్టు శిక్షణ ఇప్పిస్తే వారు ఎంచుకున్న రంగాలలో అద్భుత ఫలితాలు సృష్టిస్తారన్నారు. ఈ కార్యక్రమములో ఆల్విన్ కాలనీ ఫేస్ 2 ప్రెసిడెంట్ కృష్ణారావు, కట్టశ్రీనివాస్ పాల్గొన్నారు.