by Suryaa Desk | Sat, Oct 19, 2024, 01:49 PM
గొల్లపల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ ముస్కు కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రేకుర్తి కంటి ఆసుపత్రి చైర్మన్ లయన్ కొండ వేణుమూర్తి,వైస్ చైర్మన్ లయన్ చిదుర సురేష్ సహకారంతో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి భారీ స్పందన లభించింది.గొల్లపల్లి రెడ్డి సంఘ భవనంలో శుక్రవారం నిర్వహించిన కంటి వైద్య శిబిరానికి వివిధ గ్రామాల నుంచి నేత సంబంధిత వ్యాధులతో బాధపడే రోగులు శిబిరానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా 50 మందిని పరీక్షించగా 30 మందిని కంటి ఆపరేషన్ కోసం గుర్తించారు.వీరిని లయన్స్ క్లబ్,రేకుర్తి కంటి ఆసుపత్రి బస్సులో తరలించారు.ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ అధ్యక్షులు ముస్కు కరుణాకర్ రెడ్డి,ఉపాధ్యక్షులు బొమ్మన కుమార్,కార్యదర్శి సాయిని నరహరి,కోశాధికారి శాతల సత్యనారాయణ,మహంకాళి శేఖర్,బోల్లం రమేష్,బల భక్తుల కిషన్,సురేష్,తాడూరి సత్యనారాయణ,తదితరులు పాల్గొన్నారు.