by Suryaa Desk | Tue, Oct 01, 2024, 10:37 AM
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన కవితకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.మద్యం కేసులో తీహార్ జైలులో ఉన్నప్పుడు కవిత తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గైనిక్ సమస్యలతో ఆమె బాధపడ్డారు. ఇంతకు ముందుఆమె ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్లో కూడా వైద్య పరీక్షలు చేయించుకున్న సంగతి తెలిసిందే. కవిత త్వరగా కోలుకోవాలని పార్టీ క్యాడర్, శ్రేయోభిలాషులు ఆకాంక్షిస్తున్నారు.