by Suryaa Desk | Tue, Oct 01, 2024, 02:12 PM
విద్యార్థులు చిన్నప్పటినుంచే కష్టపడే తత్త్వం అలవార్చుకోవాలని, చెడు అలవాట్లకు బానిస కావద్దని దుబ్బాక ఎస్ ఐ గంగరాజు సూచించారు.చికోడ్ జిల్లా పరిషత్ హై స్కూల్ లో విద్యార్థిని విద్యార్థులకు రక్షణ చట్టాలపై అవగాహనా కల్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ అపరిచిత వ్యక్తుల పట్ల, సోషల్ మీడియకు దూరంగా ఉండాలని మహిళా భద్రతకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు.
మహిళాలను ఎవరైనా వేధింపులకు గురిచేసిన అవహేళన గా మాట్లాడిన వెంటనే డయల్ 100లేదా 8712667434 నంబర్ కు సమాచారం అందించాలని తెలిపారు.దుబ్బాక ఎస్ ఐ గంగరాజు, సిద్దిపేట షీ టీం బృందం కిషన్, ఏఎస్ఐ, మహిళా కానిస్టేబుల్ మమత, వీణకుమారి, కానిస్టేబుల్ ప్రవీణ్ లక్ష్మి నారాయణ, స్కూల్ హెడ్ మాస్టర్ జానకి రాములు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.