by Suryaa Desk | Tue, Oct 01, 2024, 03:18 PM
మూసీ బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై దాడిని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు.ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తున్న ప్రతిపక్షాల మీద దాడులు చేయడమేనా ప్రజా పాలన అంటే అని ఆయన ప్రశ్నించారు.ప్రజాప్రతినిధుల ఇళ్ల మీద దాడులు, నాయకుల అరెస్టులు, అక్రమ కేసులు పెట్టడమేనా ప్రజాస్వామ్యం అంటే అని హరీష్ రావు ప్రశ్నించారు. కేటీఆర్పై దాడి చేసిన వారిని గుర్తించి వెంటనే శిక్షించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.