by Suryaa Desk | Tue, Oct 01, 2024, 01:45 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్-రే సెంటర్ లేకపోవడం వల్ల, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎక్స్ - రే కోసం నర్సంపేట, మహబూబాబాద్ లకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడడంతో, వెంటనే ఆసుపత్రి యజమాన్యం వారు, ప్రైవేట్ సంస్థల వారితో సంప్రదింపులు జరిపారు. చివరిగా నెక్కొండ వాస్తవ్యులు సంపత్ రెడ్డి, శేశ్య రెడ్డి ల సహాకారంతో, ఆ డిజిటల్ ఎక్స్- రే మ్యాచిన్ ప్రభుత్వ ఆసుపత్రికి అందించినందుకు, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజల గురించి గొప్ప మనసుతో సహృదయంతో ఆలోచించి వారి కష్టాలను అర్థం చేసుకొని, వారు డిజిటల్ ఎక్స్- రే మ్యాచిన్ వితరణ చేసినందుకు గాను, సంపత్ రెడ్డి, అలాగే షేశ్య రెడ్డి లకు ప్రత్యేక అభినందనలు తెలియజేసి, అనంతరం ఎమ్మెల్యే వారిరువురిని శాలువతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో సామాజిక వైద్య ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ భానోత్ వీరన్న నాయక్, డ్యూటీ ఈ ఎన్ టి. డాక్టర్ బానోత్ లక్ష్మణ్ నాయక్, దవాఖాన సిబ్బంది, గూడూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిట్టే వెంకన్న, గూడూరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా నాయకులు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్, మండల యూత్ అధ్యక్షులు, పలు గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ జడ్పిటిసిలు, మార్కెట్ వైస్ ప్రెసిడెంట్ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.