by Suryaa Desk | Tue, Oct 01, 2024, 01:37 PM
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న "స్వచ్చత హి సేవ" కార్యక్రమం లో యువకులు స్వచ్ఛందంగా పాల్గొనాలని మున్సిపల్ కమిషనర్ మోహన్ కోరారు. మెట్ పల్లి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్, ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాలలో సోమవారం పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 30 మంది స్థానిక యువకులు స్వచ్ఛందంగా పాల్గొని పరిసరాల్లోని చెత్తను శుభ్రం చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మోహన్ మాట్లాడుతూ పట్టణం లోని యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరిశుభ్రత కార్యక్రమాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ దేవరాజ్, ఇంచార్జీ సానిటరీ ఇన్స్ పెక్టర్ రత్నాకర్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు, తదితరులు పాల్గొన్నారు.