by Suryaa Desk | Tue, Oct 01, 2024, 12:59 PM
మహబూబాబాద్ - డోర్నకల్ మండలం ధారావతు తండాకు చెందిన ధారావతు రవి(53) అనే రైతు ఆర్థిక ఇబ్బందులకు మరియు రుణమాఫీ కాలేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. రవి పొలానికి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి రాకపోవడంతో.. భర్తను వెతుక్కుంటూ వెళ్లిన భార్యకు పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే స్థానికులకు సమాచారం ఇవ్వగా.. వారు 108 వాహనంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రవి మృతి చెందాడు. కాగా రవి, అతని భార్య పేరిట బ్యాంకులో రూ.2,46,000 పంట రుణం ఉంది. అది మాఫీ కాకపోవడంతో పాటు, ఇతర అప్పులు ఉండడంతో ఆత్మహత్య చేసుకున్నాడు.