by Suryaa Desk | Tue, Oct 01, 2024, 07:10 PM
దసరా నవ రాత్రి సందర్బంగా సందర్బంగా రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవ్ పల్లి డివిజన్, గణేష్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు బతుకమ్మను రకరకాల పువ్వులతో బతుకమ్మను తయారు చేశారు. ఆటపాటలతో అది బతుకమ్మను నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.